వైసీపీ నేతల పిచ్చి పీక్స్‌.. ఆర్ఎస్‌ఎస్‌ వార్నింగ్‌...!

Home >>> పాలిటిక్స్ > వైసీపీ నేతల పిచ్చి పీక్స్‌.. ఆర్ఎస్‌ఎస్‌ వార్నింగ్‌...!

news-details

ఏపీలో ఎన్నికల కోలాహలం ముగిసింది. ఇక మిగిలింది రిజల్ట్‌ మాత్రమే. జూన్‌ 4వ తేదీ కోసం అంతా ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో జూన్‌ 1న సాయంత్రం 6 గంటలకు విడుదలయ్యే ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాల కోసం అన్ని పార్టీల నేతలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే విడుదలైన పలు సంస్థల సర్వే రిపోర్టులు మాత్రం ఏపీలో టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తేల్చి చెప్పేశాయి. కొన్ని సంస్థలు 115-125 వస్తాయంటుంటే.. కొన్ని సంస్థలు మాత్రం 110-120 మధ్యలో వస్తాయంటున్నాయి. వైసీపీకి ఎన్నికల్లో ఎదురు దెబ్బ తప్పదని జాతీయ మీడియా సంస్థలు సైతం క్లియర్‌గా చెబుతున్నాయి. 

అయితే వైసీపీ నేతలు మాత్రం తమదే గెలుపని.. జూన్‌ 9న విశాఖలో జగన్‌ ప్రమాణ స్వీకారం అంటూ తెగ ప్రచారం చేసుకుంటున్నారు. వై నాట్‌ 175 అని... రాబోయే ఫలితాలు చూసి దేశమంతా ఆశ్చర్యపోతుందని సీఎం జగన్‌ సైతం చెప్పేస్తున్నారు. దీంతో వైసీపీ నేతలంతా ఎన్నికల్లో తమదే గెలుపని గుడ్డిగా వాదిస్తున్నారు కూడా. ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా సరే... గెలుపు తమదే అని చెప్పేస్తున్నారు. మరికొందరైతే... అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. కుప్పం, పిఠాపురం, హిందూపురం, మంగళగిరిలో కూడా వైసీపీ అభ్యర్థులు గెలుస్తున్నారని గొప్పలు చెప్పుకుంటున్నారు. 

ఇదే సమయంలో వైసీపీ సోషల్‌ మీడియా మరో అరాచకానికి తెర లేపింది. బీజేపీ మాతృ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ పరువును ఇప్పుడు బజారుకు లాగే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ ఆత్మ తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్‌ రిలీజ్‌ చేసిందంటూ ఓ ఫేక్‌ రిపోర్టును రిలీజ్‌ చేసింది. తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్‌ను తమ అఫీషియల్‌ వెబ్‌ సైట్‌లో రిలీజ్‌ చేసిందని కూడా చెప్పేస్తున్నారు. ఇందులో వైసీపీకి 57.1 శాతం ఓట్లతో 159 సీట్లు వస్తాయని... టీడీపీ కూటమి 40.07 శాతం ఓట్లతో 16 సీట్లు మాత్రమే వస్తాయని ఓ ఫేక్‌ రిపోర్ట్‌ను సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ చేస్తోంది. తెలంగాణ ప్రాంత సంఘ్‌ చాలక్‌ బర్ల సుందర్‌ రెడ్డి పేరుతో అంతర్గత సర్వే అంటూ వైరల్‌ చేస్తున్నారు. 

 

అంతర్గత సర్వే అంటూనే అఫీషియల్‌ వెబ్‌సైట్‌లో ఎలా పోస్ట్‌ చేస్తారని అడిగితే సమాధానం లేదు. అసలు ఆర్‌ఎస్‌ఎస్ వెబ్‌సైట్‌లో ఆ పోస్ట్‌ లేదేమిటి అంటే ఆన్సర్‌ లేదు. జూన్‌ 1 సాయంత్రం 6 గంటలకు ముందు ఎగ్జిట్‌ పోల్‌ రాదు కదా అంటే.. జవాబు లేదు. మరి ఎందుకు పోస్ట్‌ చేశావని అడిగితే... మా వాళ్లు నాకు పంపారు... నేను గ్రూప్‌లో షేర్‌ చేశా అంటున్నారు వైసీపీ నేతలు. కనీస అవగాహన కూడా లేకుండా... ఓ ప్రముఖ పాత్రికేయులు కూడా ఈ పోస్ట్‌ను తమ అఫిషియల్‌ గ్రూప్‌లో పోస్ట్ చేసి... మళ్లీ డిలీట్‌ చేశారు. 

ఫేక్‌ రిపోర్ట్‌పై ఆర్ఎస్‌ఎస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సంస్థ ఎలాంటి రాజకీయ సర్వేలు నిర్వహించదన్నారు. రాజకీయ కార్యకలాపాలకు ఆర్‌ఎస్ఎస్‌ దూరంగా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. తమ వెబ్‌సైట్‌లో ఎలాంటి రిపోర్ట్ లేద్నారు. ఫేక్‌ రిపోర్ట్‌ సర్క్యూలేట్‌ చేస్తున్నా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే దీనిపై సైబర్‌ క్రైమ్‌ విభాగానికి ఫిర్యాదు చేసినట్లు ఆర్‌ఎస్ఎస్ నేతలు వెల్లడించారు.

You can share this post!