Home >>> పాలిటిక్స్ > అనర్హత వేటుపై రాహుల్ గాంధీ ఏమన్నారంటే..?
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎంపీ పదవిపై వేటు వేయడం దేశ రాజకీయాల్లోనే ఇప్పుడు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. గతంలో రాహుల్ గాంధీ దొంగలందరికీ మోడీ ఇంటి పేరు ఉందని రాహుల్ కామెంట్ చేసారు. బ్యాంకుల్లో వేల కోట్లు రుణం తీసుకొని బ్యాంకులు ఎగనామం పెట్టి విదేశాలు పారిపోయిన వారినుద్దేశించి రాహుల్ కామెంట్ చేశారు. దీంతో రెండు రోజులుగా మీడియాలో చర్చలు సాగడం.. రాహుల్ పై అనర్హత వేటు వేయడం అన్ని చకచక జరిగిపోయాయి.
తాజాగా అనర్హత వేటు తరువాత మీడియాతో మాట్లాడారు రాహుల్ గాంధీ. నరేంద్ర మోడీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో ఎన్నో అవకతవకలు జరిగాయి. దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతుంది. తాను ఒకటే ప్రశ్న అడిగాను. అదానీ షేల్ కంపెనీలలో 20వేల కోట్లలో పెట్టుబడులు ఎవరు పెట్టారు. పార్లమెంట్ హౌస్ లో తాను అదానీ, మోడీ స్నేహం గురించి మాట్లాడాను.
వీరిద్దరి బంధం ఇప్పటిది కాదు.. ఎప్పటి నుంచో ఉంది. నిబంధనలు మార్చి ఎయిర్ పోర్టులు అదానికి ఇచ్చారు. తాను విదేశీ శక్తుల నుంచి సమాచారం తీసుకున్నానని కేంద్ర మంత్రులు పార్లమెంట్ లో అబద్ధాలు చెప్పారు. స్పీకర్ ను కలిసి మాట్లాడేందుకు సమయం ఇవ్వమంటే నవ్వి వదిలేశారు. నాపై అనర్హత వేటు వేసినా.. జైలుకు పంపినా తగ్గేదే లేదు. న్యాయవ్యవస్థను గౌరవిస్తానని, జైలు శిక్ష పై ఏం మాట్లాడను అని చెప్పుకొచ్చారు రాహుల్ గాంధీ.
దేశ ప్రజాస్వామ్యం కోసం పోరాడాను.. పోరాడుతానని పేర్కొన్నారు. ప్రజల్లోకి వెళ్లడం ఒక్కటే ఇప్పుడు ప్రతిపక్షాలకు ఉన్న అవకాశమని తెలిపారు. వయనాడ్ ప్రజలకు నా మనసులో ఏముందో లేఖ రాస్తాను అని పేర్కొన్నారు.బీజేపీ నేతలందరూ నరేంద్ర మోడీ అంటే భయపడుతారు. బీజేపీ నేతలకు అంతా తెలుసు అని, నా తరువాత ప్రసంగంకి భయపడే ప్రధాని తనపై అనర్హత వేటు వేశారని పేర్కొన్నారు రాహుల్ గాంధీ.