Home >>> పాలిటిక్స్ > అమిత్షా టార్గెట్ దక్షిణ భారతదేశం...!
నార్త్ రాష్ట్రాల్లో బీజేపీ బలం అధికంగా ఉన్నా.. దక్షిణ భారతదేశంలో మాత్రం బీజేపీ అడుగుపెట్టలేకపోతుంది. నిన్నటి వరకు కర్ణాటకలో అధికారంలోకి ఉన్న కాషాయం పార్టీకి కన్నడిగులు షాకిచ్చారు. దీంతో కేవలం 70 సీట్లు లోపు మాత్రమే వచ్చారు. దీంతో బీజేపీ ముక్త్ దక్షిణ భారత్లా మారింది. అయితే దక్షిణ భారతదేశంలో ఎన్నికలు వచ్చే రాష్ట్రం ఏదైనా ఉంది అంటే..అది తెలంగాణ మాత్రమే. తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని అమిత్షా శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. అందుకే శనివారం రాత్రి టీడీపీ అధినేత చంద్రబాబుతో అమిత్షా సమావేశం అయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకొని.. ఎన్నికల్లో విజయం సాధించాలని టార్గెట్ పెట్టుకున్నట్లు సమాచారం..
తెలంగాణలో టీడీపీకి ఓటు బ్యాంకు
తెలంగాణలో బీజేపీ సత్తా చాటాలి అంటే ఒంటరిగా పోటీ చేస్తే కుదరదని గ్రహించింది అధిష్టానం. తెలంగాణలో టీడీపీకి ఓటు బ్యాంకు ఉన్న విషయాన్ని కమలం పెద్దలు గుర్తించారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున అనేక మంది గెలిచి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికి టీఆర్ఎస్ పార్టీలో ఉన్న అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన వారే. తెలంగాణలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఓటు బ్యాంకు ఉందని బీజేపీ నేతలు అధిష్టానానికి సమాచారం ఇచ్చారు. కొన్ని నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను టీడీపీ నిర్ణయించే స్థాయిలో ఉన్నారని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. తెలంగాణలో బీజేపీకి టీడీపీ దగ్గర అయితే మరింత లాభం చేకూరుతుందని కాషాయం నేతలు భావిస్తున్నారు. అందుకే సడన్గా అమిత్షా, నడ్డాలు చంద్రబాబుతో ప్రత్యేకంగా గంటపాటు సమావేశం అయినట్లు హస్తిన వర్గాలు చెబుతున్నాయి.
బీఆర్ఎస్ పేరు సెంటిమెంటుకు పనికిరాదా..?
ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ పేరుగా మార్చేశారు. దీంతో దేశం రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకోవాలని ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఆపరేషన్ బీఆర్ఎస్ మొదలు పెట్టారు. పక్కనున్న మహారాష్ట్రతో పాటు ఒడిశాలో పలువురు కీలక నేతలను బీఆర్ఎస్లో చేర్చుకున్నారు. పలు బహిరంగ సభలు ఏర్పాటు చేశారు కేసీఆర్. ఇక ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎంలు కొన్ని రోజుల క్రితం తెలంగాణ సీఎంను కలిశారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకునేలా ప్లాన్స్ వేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే మొన్నటి వరకు ఏ ఎన్నికలు జరిగినా తెలంగాణ సెంటిమెంట్ రగిల్చే కేసీఆర్కు ఇక ఆ సెంటిమెంట్ ఉపయోగిస్తారా..? లేదా అన్నది మాత్రం సస్పెండ్గా మారింది. ఎందుకంటే జాతీయ రాజకీయాల్లో కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాలను లెవనెత్తితే అక్కడి ప్రజలకు ఇక్కడి సెంటిమెంట్ను తీసుకునే అవకాశం ఉండదు. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకుంది. అయితే సీఎం కేసీఆర్ నాడు సెంటిమెంట్ను రగల్చడంతో.. విజయం సాధించారు. తెలంగాణపై ఏపీ పెత్తనం ఏంటని గ్రౌండ్ లెవల్కు తీసుకెళ్లారు. అయితే బీజేపీకి కూడా వచ్చే ఎన్నికల్లో ఇదే పరిస్థితి ఎదురవుతుందని తొలుత భావించారు. కానీ బీఆర్ఎస్ ఏర్పాటు చేయడంతో.. చంద్రబాబు గురించి కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉండకపోవచ్చని బీజేపీ భావిస్తోంది..