Home >>> క్రైమ్ > BREAKING : ఏపీలో భారీ పేలుడు..ఇద్దరు మృతి, మరో 7 గురు
అనకాపల్లి అచ్చుతాపురం సెజ్ లో ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రెండు రియాక్టర్లు పేలడంతో... భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయి మంటలు. ఇక అటు మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నాయి అగ్నిమాపక దళాలు. ఇప్పటికే ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. భారీ శబ్దాలు రావడంతో భయపడుతున్నారు ప్రజలు. ఈ ఫార్మా కంపెనీ ప్రమాదంలో ఇప్పటివరకు 7 మంది కార్మికులు...తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర గాయాలైన వారికి మెరుగైన చికిత్స నిమిత్తం వివిధ హాస్పిటల్స్ కు తరలించారు అధికారులు. గాజువాక లోని కిమ్స్ హాస్పిటల్ కు 4 గురు, కేజీహెచ్ కు ముగ్గురిని తరలించారు పోలీసులు.
గాయపడిన వారి వివరాలు...
కిమ్స్
రమేష్(40) భువనేశ్వర్
సత్తిబాబు(35) రాంబిల్లి
నూకి నాయుడు(48) పంచ ధర్ల
తిరుపతి (28), విజయనగరం
కేజీహెచ్
రాజబాబు(23) రేబాక
అప్పారావు(43) నక్కపల్లి
సంతోష్ కుమార్(34) కొండ కొప్పాక
స్వల్ప గాయాలతో మరికొందరు అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ కు తరలింపు...