తెలుగుతల్లి ఫ్లైఓవర్ పై ఘోర ప్రమాదం

Home >>> క్రైమ్ > తెలుగుతల్లి ఫ్లైఓవర్ పై ఘోర ప్రమాదం

news-details

ఏపీలో ఘోర ప్రమాదం జరిగింది. విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. నగరంలోని తెలుగు తల్లి ఫ్లై ఓవర్ పై టాటా హెరియర్ వాహనం అతివేగంగా దూసుకొచ్చి ఓ బైకు, స్కూటీలను ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళుతున్న ఇద్దరు ప్రయాణికులు ఫ్లై ఓవర్ మీద నుండి 30 అడుగుల కిందకి పడిపోయారు. వివరాల ప్రకారం... తెలుగు తల్లి ఫ్లై ఓవర్ పై టాటా హేరియర్ వాహనం బీభత్సం సృష్టించింది.

 

టాటా హేరియర్ నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో వేగంగా వాహనాన్ని నడపడం వల్ల వాహనం బైకు, స్కూటీలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న వ్యక్తి ఫ్లైఓవర్ మీద నుండి 30 అడుగుల కిందకు పడిపోయాడు. దీంతో అతని తలకి బలమైన గాయాలు తగిలాయి. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో స్కూటీ నుజ్జునుజ్జు అయ్యింది. సంఘటన స్థలానికి లా అండ్ ఆర్డర్ డీసీపీ విద్యాసాగర్ నాయుడు చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.

You can share this post!