Home >>> పాలిటిక్స్ > ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితులపై సెటైర్లు వేస్తున్న కేటీఆర్
వరంగల్, హనుమకొండ జిల్లాల్లో మంత్రి శ్రీ కేటీఆర్ పర్యటిస్తున్నారు. అందులో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
వరంగల్ సమీపంలోని మడికొండ ఐటీ పార్క్లో క్వాట్రెండ్ సాఫ్టువేర్ కంపెనీ బ్రాంచ్ ఏర్పాటుకు విచ్చేసిన కేటీఆర్ ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక పరిస్థితి పైన...ఇక్కడి పరిస్థితులు పైన తనదయిన శైలిలో కామెంట్స్ చేసారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఏపీ ప్రస్తావన తీసుకు వచ్చారు. హైదరాబాద్, వరంగల్తో పాటు ఆంధ్రప్రదేశ్లోనూ ఐటీ కంపెనీలు రావాలని మంత్రి వ్యాఖ్యానించారు. ఆంధ్రాలోని భీమవరం, నెల్లూరు ప్రాంతాల్లో భవిష్యత్లో ఉజ్వలమైన ఉపాధి అవకాశాలు వస్తాయనన్నారు. అవసరం అయితే జగనన్న కి చెప్పి అక్కడ జాగా ఇప్పిస్తా అని చెప్పారు.
మరియు రెండు తెలుగు రాష్ట్రాల్లో చదుకున్న, చదువుకుంటున్న తెలుగు యువతకి ఐటి పరిశ్రమల వల్ల ఎంతగానో ఉపయోగం కలుగుతుంది అని, భారతదేశ నిర్మాణానికి యువత పాత్ర ఎంతో ప్రాముఖ్యమయినది అని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రస్తావించారు.